: ఐపీఎల్ లో ఆసక్తికరమైన మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం...గురుశిష్యుల మధ్య పోరాటం

ఐపీఎల్ లో ఆసక్తికరమైన మ్యాచ్ కాసేపట్లో రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో 8 సీజన్లపాటు కలిసి ఆడిన ఆటగాళ్లు తొలిసారి ప్రత్యర్థులుగా తలపడనున్నారు. స్నేహితులు, సహచరులు, గురు శిష్యులుగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనాలు ఇంతవరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయపథాన నడిపారు. ఇప్పుడు పూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ధోనీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్ గా సురేష్ రైనా జట్టు బాధ్యతలు తలకెత్తుకున్నాడు. వీరిద్దరూ తొలి మ్యాచ్ లలో విజయం సాధించారు. ఇప్పుడు తొలిసారి వీరిద్దరూ ఎదురెదురుగా తలపడనుండడంతో ఈ మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రావీణ్యంతో ధోనీ నెగ్గుకొస్తాడా? ధోనీ దగ్గర నేర్చుకున్న మెళుకువలకు పదును పెట్టి రైనా విజయం సాధిస్తాడా? అన్నది అందరి మదిలోనూ రేగుతున్న ప్రశ్న. దీంతో ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది.

More Telugu News