: ఐపీఎల్ కు షాక్...ముంబై నుంచి మ్యాచ్ లు తరలించండి: బాంబే హైకోర్టు

మహారాష్ట్రలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బీసీసీఐకి తొలిసారి షాక్ తగిలింది. మహారాష్ట్రలో కరవు కారణంగా ఏర్పడిన నీటి ఎద్దడిని పట్టించుకోకుండా ఐపీఎల్ ను నిర్వహిస్తున్నారని, ఇందుకు లక్షల లీటర్ల నీరు వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల ఐపీఎల్ ను మహారాష్ట్ర నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన బాంబే హైకోర్టు ఈ నెల 30 తరువాత మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను వేరే ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. దీంతో వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని బీసీసీఐ వాపోతోంది.

More Telugu News