: చాలా లోతుగా ఆలోచించి '24' అనే టైటిల్ ఖరారు చేశారు: కార్తీ

'ఊపిరి' సినిమాలో తనను ఆదరించినందుకు ధన్యవాదాలని హీరో కార్తీ చెప్పాడు. '24' ఆడియో వేడుకలో కార్తీ మాట్లాడుతూ, 'ఊపిరి' సినిమాలో తాను వేసిన పెయింటింగ్ లాగే ఈ సినిమా కూడా మాస్టర్ పీస్ అని అన్నాడు. దీంతో ఆడిటోరియం కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు '24' ఏంటి? అని చాలా ఆలోచించానని అన్నాడు. అసలు విషయం ఆ తరువాత అర్థమైందని అన్నాడు. టైమ్ అనే దాంట్లో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని, అందుకే దీనికి '24' అని పెట్టారని ఆయన చెప్పాడు. ఈ సినిమాలో తన అన్నయ్య మూడు పాత్రల్లో నటించాడని, దేనికదే విభిన్నమని కార్తీ చెప్పాడు. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని కార్తీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తాను రెహమాన్ ను స్పూర్తిగా తీసుకుంటానని చెబుతున్నానని అన్నాడు. జీవితాన్ని సానుకూలంగా తీసుకుని కష్టపడబట్టే రెహమాన్ ఉన్నత స్థానానికి చేరుకున్నారని కార్తీ అన్నాడు. అలాగే తాను కూడా జీవితాన్ని సానుకూలంగా తీసుకుంటున్నానని కార్తీ తెలిపాడు.

More Telugu News