: చెప్పేదే చేస్తా...చేసేదే చెప్తా: కరుణానిధి

డీఎంకే అధినేత కరుణానిధి తమిళనాడు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో డీఎంకే అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. తాము అధికారంలోకి వస్తే ఒకే దశలో మద్యనిషేధం చేపడతామని తెలిపారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంత చిరు వ్యాపారులకు లక్ష రూపాయల నిధిని అందజేసే విధంగా చర్యలు తీసుకోనున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యా, రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. అలాగే గ్రామాల్లో కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయలు అందజేస్తామని ఆయన మేనిఫెస్టోలో తెలిపారు.

More Telugu News