: కష్టాల్లో ముంబై ఇండియన్స్... 40 పరుగులకే 5 వికెట్లు డౌన్!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ శర్మ (7) ను ఇషాంత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. అనంతరం సిమ్మన్స్ (8)ను మరో అద్భుతమైన బంతికి బౌల్డ్ చేశాడు. దీంతో 29 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హార్డిక్ పాండ్య (9)ను పెవిలియన్ కు పంపిన మార్ష్ తరువాతి బంతికి బట్లర్ (0) ను బలిగొన్నాడు. అనంతరం దిగిన పొలార్డ్ (1)ను భాటియా అవుట్ చేశాడు. దీంతో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం అంబటి రాయుడు (9), యస్.గోపాల్ (1) క్రీజులో ఉన్నారు. పది ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్టు బౌలర్లలో ఇషాంత్ శర్మ, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీయగా భాటియా ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు.

More Telugu News