: భాగ్యనగరంలో 'శ్రీమంతుడి' దోశె సందడి

తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్ యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వ్యాపారం పెంచుకోవడంలో భాగంగా తాము తయారు చేసే వంటకాలకు సినిమాలు, సినీ నటుల పేర్లు పెడుతూ వినూత్నంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాదులోని ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1 లో కొత్తగా ఏర్పాటు చేసిన 'కారంపొడి' రెస్టారెంట్లో 'శ్రీమంతుడి' దోశెలు సందడి చేస్తున్నాయి. ఈ దోశె ధర కేవలం 600 రూపాయలు అని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్పారు. ఇందులో బంగారం పూతను ఐదు లేయర్లుగా దోశెపై పూసినట్టు వారు వెల్లడించారు. సంప్రదాయానికి భిన్నంగా వినూత్నంగా ఇలాంటి వంటకాలను వినియోగదారులకు పరిచయం చేస్తూ వ్యాపారం పెంచుకుంటున్నారు. గత వారం భీమవరంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' మెనూను పరిచయం చేస్తూ ఓ హోటల్ వినియోగదారులకు వల వేసిన సంగతి తెలిసిందే.

More Telugu News