: బ్యాట్స్ మన్ కు క్లాస్ పీకిన రవిశాస్త్రి

టీమిండియా కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ తో ఆడనుంది. ఇంతవరకు టోర్నీలో చేసిన ప్రదర్శన వేరు. నేడు చేయాల్సిన ప్రదర్శన వేరు. ఈ నేపథ్యంలో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఓపెనర్, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కు క్లాస్ పీకాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆడిన మ్యాచుల్లో చేసిన ప్రదర్శనను ఆటగాళ్లతో రవిశాస్త్రి ప్రస్తావించాడు. కేవలం కోహ్లీ, ధోనీ ఆడితే సరిపోదని స్పష్టం చేశాడు. ప్రధానంగా ఓపెనర్లు మరింత మంచి ప్రదర్శన ఇవ్వాలని కోరాడు. అన్ని జట్ల ఓపెనర్లు ఫీల్డింగ్ నిబంధనలు వినియోగించుకుని పరుగుల ప్రవాహం చేస్తోంటే...టీమిండియా ఓపెనర్లు పేలవ షాట్లకు అవుట్ కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ రాణించాల్సిన అవసరాన్ని గుర్తుచేశాడు. జట్టు భారం ఒకరిద్దరు మోస్తే సరిపోదని, అంతా పంచుకోవాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా బౌలర్లకు కూడా పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. కీలకమైన మ్యాచ్ లో సమష్టిగా రాణిస్తే విజయం సాధించడం కష్టం కాదని చెప్పాడు.

More Telugu News