: మాటలు కట్టిపెట్టి...ఇక ఆట ఆడండి: ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం

కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గత శనివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గెలుపోటములతో సంబంధం లేకుండా వంద శాతం ఆడడం గురించి ఆలోచిస్తామని అఫ్రిది చెప్పాడు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, మాటలు కట్టిపెట్టి ఆట ఆడడం మొదలుపెట్టాలని అన్నాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆయన సూచించాడు. కాగా, ఈ మ్యాచ్ కు ముందు క్యాబ్ సన్మానానికి హాజరైన సందర్భంగా, భారత్ తో ఎలా ఆడితే ఒత్తిడిని జయించవచ్చు? భారత్ తో ఎలా ఆడాలి? వంటి విలువైన సలహాలను ఇమ్రాన్ ఖాన్ పాక్ జట్టుకి ఇచ్చాడు. అయినప్పటికీ పాక్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

More Telugu News