: యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్... నో ప్రాబ్లం!: గ్రౌండ్స్ మెన్

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న భారత్-పాకిస్థాన్ టీ20 మ్యాచ్ కు ఎలాంటి అడ్డంకులు లేవని గ్రౌండ్స్ మెన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీమిండియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కు ఈ ఉదయం వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. పొడిగా ఉన్న కోల్ కతాలో అకస్మాత్తుగా తన ప్రతాపం చూపడం ప్రారంభించాడు. దీంతో నేటి ఉదయం నుంచి కోల్ కతాను వర్షం ముంచెత్తింది. దీంతో స్టేడియం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు ముసురుకున్నాయి. అయితే గ్రౌండ్స్ మెన్ మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని తేల్చడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

More Telugu News