: ఈడీ ఆఫీస్ లో ‘కింగ్ ఫిషర్’ మాజీ సీఎఫ్ఓ... మాల్యా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ ఆరా

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారానికి సంబంధించి కాస్త ఆలస్యంగానైనా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇదివరకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ... తమ ముందు విచారణకు హాజరుకావాలని మాల్యాకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులను బేఖాతరు చేస్తూ మాల్యా ఈ నెల 2న లండన్ చెక్కేశారు. ఈ క్రమంలో బ్యాంకులిచ్చిన రుణాల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నేటి ఉదయం రంగంలోకి దిగిన ఈడీ అధికారులు మాల్యాను నష్టాల్లో ముంచేసిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ సీఎఫ్ఓ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) ఎ.రఘునాథన్ ను తమ కార్యాలయానికి పిలిపించారు. మాల్యా వ్యవహారం, సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఆయనకు ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం.

More Telugu News