: ‘పొట్టి’ ప్రపంచ కప్ సమరం షురూ!... నేటి నుంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రధాన జట్లు పాల్గొనే మ్యాచ్ ల కంటే ముందుగా ఈ సిరీస్ లో పాల్గొనేందుకు అర్హత కోసం పసికూనల మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి షెడ్యూల్ లో భాగంగా నేటి మధ్యాహ్నం 3 గంటలకు హాంకాంగ్ తో జింబాబ్వే, ఆప్ఘనిస్థాన్ తో స్కాట్లాండ్ లు తలపడనున్నాయి. అసలు సిరీస్ ఈ నెల 15న ప్రారంభం కానున్నప్పటికీ, సిరీస్ లో అర్హత సాధించేందుకు పసికూనలు చేయనున్న విన్యాసాలు కూడా క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి.

More Telugu News