: ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలో స్మార్ట్ ఫోన్ సొంతం కావాలంటే..!

కేవలం రూ. 251 ధరలో నేటి సాయంత్రం విడుదల కానున్న రింగింగ్ బెల్స్ 'ఫ్రీడమ్ 251' కోసం నెటిజన్లు, ముఖ్యంగా యువత ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతోంది. ఈ ఫోన్ ఎక్కడ లభిస్తుంది? రేపే కొనుగోలు చేయాలంటే ఎలా? వంటి క్వైరీస్ తో గూగుల్ సెర్చింజన్ కు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఫోన్ బుకింగ్స్ రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 21 రాత్రి 8 గంటల వరకూ పలు ఈ-కామర్స్ వెబ్ సైట్ల ద్వారా బుకింగ్స్ ను తీసుకుంటామని రింగింగ్ బెల్స్ వర్గాలు వెల్లడించాయి. ఆపై డెలివరీలను ప్రారంభిస్తామని, జూన్ 30లోగా రిజిస్ట్రేషన్ లు చేసుకున్న అందరికీ డెలివరీ అందిస్తామని, ఆపై బహిరంగ మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపాయి.

More Telugu News