: కెమికల్స్ తో అరటిపళ్లను మగ్గబెడుతున్న వ్యాపారుల అరెస్టు

అరటిపళ్లను కెమికల్స్ తో మగ్గబెడుతున్న వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్, భవానీనగర్, బహదూర్ పురా, రెయిన్ బజార్ ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈరోజు సోదాలు నిర్వహించి ఐదుగురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 103 కెమికల్ సీసాలను, 950 అరటి గెలలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కెమికల్స్ తో అరటిపండ్లను మగ్గబెట్టవద్దని మిగిలిన వ్యాపారులను హెచ్చరించామని, తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

More Telugu News