: ఆ ద్వీపంలో వ్యవసాయం చేసేందుకు రైతు కావాలట!

ఆఫ్రికాకు, దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న ఓ చిన్న ద్వీపం ట్రిస్టన్ డ కున్హా. ఓ ప్రకటనతో ఇప్పుడీ ద్వీపం వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఆ ప్రకటన ఏమిటంటే, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసేందుకు ఓ మంచి రైతు కావాలట! అక్కడి అధికారులు ఇచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ద్వీపంలో జనాభా కేవలం 300 మాత్రమే. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఈ దీవి ప్రజలకు వ్యవసాయం చేయటం అస్సలు తెలియదు. ఎక్కువగా ఆలుగడ్డలు పండిస్తుంటారు. అందువల్ల కావల్సిన వస్తువులన్నీ బ్రిటన్ నుంచే దిగుమతి చేసుకుంటుంటారు. దాంతో తమ ప్రాంతంలో వ్యవసాయం చేసేందుకు రైతు కావాలంటూ తాజాగా అక్కడి అధికారులు వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు.

More Telugu News