: నా ఉద్యమం 20 శాతమే విజయవంతం అయింది: ముద్రగడ

కాపులకు రిజర్వేషన్లు సాధించే ప్రక్రియలో తన ఉద్యమం 20 శాతం మాత్రమే విజయవంతం అయిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. మిగతాది ప్రభుత్వమే చేయాల్సి ఉందని చెప్పారు. కాబట్టి మరోసారి రోడ్డెక్కే పరిస్థితిని ప్రభుత్వం తీసుకురావద్దని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఏడు నెలల్లోగా జీవో ఇచ్చి కాపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25లోగా రుణాల కోసం కాపులు దరఖాస్తు చేసుకోవాలని ముద్రగడ కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, కిర్లంపూడిలో మందు తాగిన కాపు సోదరుడిని ఆసుపత్రికి తరలించిన అడిషనల్ ఎస్పీ దామోదర్ కు ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు.

More Telugu News