: కాల్పులు జరిపింది శశికుమారే: డీసీపీ కమలాసన్ రెడ్డి

హైదరాద్ లోని హిమాయత్ నగర్ వైద్యుల కాల్పుల ఘటనలో డాక్టర్ ఉదయ్ కుమార్ పై కాల్పులు జరిపింది ఆత్మహత్య చేసుకున్న మరో వైద్యుడు శశికుమారేనని డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక నిర్ధారణ అయిందన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కారులో వెళుతుండగా డ్రైవింగ్ సీట్లో ఉదయ్, పక్కసీట్లో సాయికుమార్ కూర్చున్నారని, వెనకాల సీట్లో శశికుమార్ కూర్చున్నారని, కాబట్టి చెవి దగ్గర కాల్చే అవకాశం వెనక కూర్చున్న వారికే ఉంటుందని వివరించారు. అందుకే ఉదయ్ పై శశినే కాల్పులు జరిపాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో శశి స్నేహితురాలు చంద్రకళను ఈరోజు విచారిస్తామని తెలిపారు. ఉదయ్ శరీరం నుంచి తీసిన తూటా ముక్కలను ఎఫ్ఎస్ఎల్ కు పంపినట్టు చెప్పారు.

More Telugu News