: 14న విశాఖలో భారత్, లంక మధ్య టీ20 మ్యాచ్... రేపటి నుంచి టికెట్ల అమ్మకం

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా సాగర నగరం, నవ్యాంధ్ర ఎకనమిక్ కేపిటల్ విశాఖ కూడా ఓ మ్యాచ్ కు వేదిక కానుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 14న (చివరి టీ20) విశాఖలో జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు విశాఖ జాయింట్ కలెక్టర్ నివాస్ నేటి ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఎంపిక చేసిన 18 ఈ-సేవా కేంద్రాల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని జేసీ నివాస్ ప్రకటించారు. జేసీ ప్రకటన ప్రకారం... రేపటి నుంచి రూ.300, రూ.600 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎల్లుండి నుంచి రూ.1,000, రూ.1,500, రూ.2.000, రూ.3,000 టికెట్ల విక్రయం మొదలు కానుంది.

More Telugu News