: హనుమంతప్ప త్వరగా కోలుకోవాలంటూ జగన్ ట్వీట్

సియాచిన్ ఘటన నుంచి బయటపడిన ఆర్మీ జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు "సియాచిన్ మంచు తుపాను నుంచి మృత్యుంజయుడైన లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అంటూ ఆయన ట్విట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను కోమాలో ఉన్నాడు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. మరోవైపు హనుమంతప్ప కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.

More Telugu News