: 'స్మార్ట్' మోసాల్లో టాప్-2లో ఇండియా: కాస్పర్ స్కై

స్మార్ట్ ఫోన్ల వాడకం శరవేగంగా పెరిగిపోతున్న వేళ, దీన్ని అలుసుగా చేసుకుని నేరాలు చేస్తున్న సైబర్ మోసగాళ్ల సంఖ్యా గణనీయంగా పెరుగుతోందని యాంటీ వైరస్ సేవలందిస్తున్న కాస్పర్ స్కై ఓ రిపోర్టును విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ వాడకందారులు తగు జాగ్రత్తలో లేకుంటే ఖాతాల్లోని డబ్బును కోల్పోవాల్సిందేనని హెచ్చరించింది. దీంతో పాటు వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరిపోతున్నదని, సాధ్యమైనంత వరకూ స్మార్ట్ ఫోన్ల నుంచి ఆన్ లైన్ షాషింగ్, బిల్లు చెల్లింపులకు దూరంగా ఉంటేనే మేలని సలహా ఇచ్చింది. హాకర్ల బారిన పడకుండా ఉండేలా ఫోన్లకు మెరుగైన వైరస్ నియంత్రణ వ్యవస్థలను జోడించాలని సూచించింది.

More Telugu News