: 1500 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ. 66.30 లక్షల బోనస్ ప్రకటించిన సంస్థ ఇదే!

ఆ సంస్థలో ఉద్యోగులకు వారం రోజుల ముందే క్రిస్మస్ కానుక అందింది. అది కూడా అలాంటి, ఇలాంటి కానుక కాదు. ఏకంగా ఒక్కో ఉద్యోగికీ రూ. 66.30 లక్షల బోనస్. మొత్తం 1400 మందికి పైగా ఉద్యోగులతో ఇంధన వనరుల సంస్థగా సేవలందిస్తున్న 'హిల్ కార్ప్' ఈ బోనస్ ను ప్రకటించి, ఉద్యోగుల్లో ఆనందాశ్చర్యాలను పెంచింది. గత సంవత్సరం రూ. 20 లక్షలకు పైగా బోనస్, ఓ కారును అందించిన సదరు సంస్థ, ఈ ఏడు ఆ మొత్తాన్ని మూడింతలు పెంచింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోయినా, సహజవాయువు ఉత్పత్తి తగ్గినా, హిల్ కార్ప్ మాత్రం రెండింతల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. దీనికి ఉద్యోగులే కారణమని నమ్మిన సంస్థ చైర్మన్ హిల్దే బ్రాండ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇటీవలి ఫోర్బ్స్ జాబితా ప్రకారం హిల్దే ఆస్తుల విలువ 5.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 39 వేల కోట్లు).

More Telugu News