: ఎక్కువగా పడుకోవడం మద్యం సేవించడం కంటే డేంజర్!

అతిగా మద్యం సేవించడం, పొగతాగడం ప్రాణాలకు ముప్పు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, అతిగా నిద్రపోవడం కూడా ముప్పే అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్రపోతే మరణానికి దగ్గరవుతామట. 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. అతిగా మద్యపానం, ధూమపానం చేసిన వారి కంటే అతిగా నిద్రపోయేవారు చనిపోవడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికితోడు ఎక్కువ నిద్రపోయేవారు, ఎక్కువసేపు కూర్చునేవారు చనిపోవడానికి ఉండే అవకాశాలు సాధారణ వ్యక్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వారు సరాసరి ఆరు గంటలు పడుకుంటే క్షేమదాయకమని... మద్యం సేవించే వారు ఏడు గంటలు పడుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు తెలిపారు.

More Telugu News