: నితీశ్-లాలూకు శుభాకాంక్షలు చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ

బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన మహాకూటమికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ లో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాన పార్టీగా అవతరించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఆయన అభినందనలు తెలిపారు. బీహార్ లోని కిషన్ గంజ్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులు, మైనారిటీలపై వివక్ష చూపకుండా పరిపాలన చేయాలని మహాకూటమికి సూచించారు. కాగా, బీహార్ ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల నుంచి ఎంఐఎం పోటీ చేసినప్పటికీ ఎక్కడా గెలవని సంగతి తెలిసిందే!

More Telugu News