: చింటూ విదేశాలకు వెళ్లే ప్రసక్తే లేదు: డీజీపీ రాముడు

చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ ల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ విదేశాలకు వెళ్లే ప్రసక్తే లేదని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. గతంలోనే చింటూ పాస్ పోర్టును సీజ్ చేశామని, అందువల్ల విదేశాలకు వెళ్లే అవకాశం లేదని చెప్పారు. మరోవైపు ఓ పత్రికకు చింటూ రాసిన లేఖపై పరిశోధన చేస్తున్నామని... హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

More Telugu News