: మైక్రోమ్యాక్స్ నుంచి తొలి 4జీ స్మార్ట్ ఫోన్

దేశీ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ నుంచి తొలి 4జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.'కాన్వాస్ ఎక్స్ ప్రెస్ 4జీ' పేరుతో మార్కెట్ లోకి విడుదలైంది. ఇందులో 1 గిగాహెర్ట్జ్ మీడియా టెక్ ఎంటీ 6735 ప్రాసెసర్, 2జీబీ డీడీఆర్ఎం3 ర్యామ్, 5 అంగుళాల తెర, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.6,599గా నిర్ణయించగా, కాన్వాస్ ఎక్స్ ప్రెస్ 4జీ కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభ్యమవుతుంది. ఇదే సమయంలో దీర్ఘకాలిక 4జీ డివైసెస్ ప్రణాళికను మైక్రోమ్యాక్స్ వెల్లడించింది. మార్కెట్ లో ఇప్పుడు 4జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోందని, దానికి అనుగుణంగా కొత్త ఫోన్లు తీసుకువస్తున్నామని మైక్రోమ్యాక్స్ సీఈవో వినీత్ తనెజా తెలిపారు. ఆన్ లైన్ లో అమ్ముడవుతున్న వాటిలో 40 శాతం 4జీ ఫోన్లేని చెప్పారు.

More Telugu News