: జీపులో పర్యాటకులు...చుట్టూ సింహాలు!: సెరెంగెటే పార్కులో ఒళ్లు జలదరించే సన్నివేశం

వన్య ప్రాణులను చూస్తూ హాలీడేస్ ను జాలీగా గడిపేద్దామని టాంజానియాలోని సెరెంగెటే జాతీయ పార్కుకు వెళ్లిన ఓ పర్యాటక బృందానికి అక్కడ భయానక అనుభవం ఎదురైంది. సరదాగా జంతువులను చూస్తూ ఆ బృందం సభ్యులంతా జీపులో వెళుతున్నారు. ఎప్పుడొచ్చాయో కాని రెండు సింహాలు ఆ జీపును చుట్టుముట్టాయి. జీపును కదలకుండా చేద్దామనుకున్నాయో, ఏమో తెలియదు కాని జీపు టైరును కొరికిపడేశాయి. ఇంకేముంది, జీపు అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఆ తర్వాత జీపులో ఉన్న వారిని కబళించేందుకు లంఘించిన సింహాలు అద్దాలు పగులగొట్టేందుకు యత్నించాయి. దాదాపు గంట పాటు సింహాలు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో నిరాశగా సింహాలు అక్కడి నుంచి కదిలివెళ్లిపోయాయి. ఈ తతంగం జరుగుతున్నంతసేపు ఎక్కడ సింహాలు తమను ముక్కలుగా కొరికి చంపేస్తాయోనన్న భయంతో జీపులోని పర్యాటకులు బిక్కచచ్చిపోయారు. అయితే సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ పర్యాటక బృందం బతుకు జీవుడా అంటూ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇంతటి ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాన్ని సెరెంగెటే పార్కులో పర్యాటక గైడ్ గా పనిచేస్తున్న ఇమ్మనుయేల్ బయో తన కెమెరాలో బంధించారు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

More Telugu News