: అభిమానులను వెనకేసుకొచ్చిన ధోనీ

కటక్ లో జరిగిన మ్యాచ్ లో స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరి దేశం పరువు తీసిన అభిమానులను కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వెనకేసుకొచ్చాడు. అభిమానులు సరదాగా అలా స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరారని చెబుతున్నాడు. దీనిని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం లేదని ధోనీ చెప్పాడు. ప్రేక్షకుల వల్ల ఆటగాళ్ల భద్రతకు హాని కలగలేదని ధోనీ స్పష్టం చేశాడు. గతంలో వైజాగ్ లో భారత్ ప్రత్యర్థిని త్వరగా ఓడించినప్పుడు కూడా బాటిల్స్ విసిరారని, అప్పట్లాగే ఇప్పుడు కూడా సరదాగా అలా చేశారని ధోనీ అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News