: ఇక స్మార్ట్ ఫోన్ నుంచే ఇంటర్వ్యూలు!

ఇంటర్వ్యూల పేరిట కంపెనీలు, ఉద్యోగార్థులు గంటల కొద్దీ సమయాన్ని వేస్టు చేసుకోకుండా, స్మార్ట్ ఫోన్ నుంచే ఇంటర్వ్యూల తతంగం నడిపించుకునేలా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వాయిస్ టెక్ స్టార్టప్ ఈ-పాయిస్, తాజాగా వినూత్నమైన యాప్ ను విడుదల చేసింది. దీని ద్వారా సులువుగా కంపెనీ యాజమాన్యం, అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేయవచ్చని సంస్థ సీఈఓ సచిన్ అగర్వాల్ వివరించారు. ఓలా, ఫ్లిప్ కార్ట్, రెడ్ బస్, బుక్ మై షో వంటి 100కు పైగా కంపెనీలు ఈ యాప్ ను వాడనున్నాయని వివరించారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ సిస్టమ్స్ కు మాత్రమే లభ్యమయ్యే యాప్ ఐఓఎస్ వర్షన్ త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వివరించారు.

More Telugu News