: ప్రయాణికుల ఆగ్రహం...ఎయిరిండియా నిగ్రహం

హైదరాబాదు-బెంగళూరు ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం కారణంగా బయల్దేరిన కాసేపటికే వెనుదిరిగింది. శంషాబాదు ఎయిర్ పోర్టులో తిరిగి ల్యాండ్ అయింది. అయితే బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు బయల్దేరాల్సిన విమానాలకు ఇది కనెక్టింగ్ ఫ్లైట్ కావడంతో ప్రయాణికులు విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుదిరగడం వల్ల తాము నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో వెనుదిరిగాల్సి వచ్చిందని సిబ్బంది సర్దిచెప్పారు. పరిస్థితిని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని వారు కోరారు.

More Telugu News