: ఇక సమరమే... మీరు సిద్ధంగా ఉండండి!: ప్రత్యేక హోదాపై రఘువీరాకు రాహుల్ ఫోన్

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన రఘువీరాతో చర్చించారు. ప్రత్యేక హోదా సాధించుకోవడం ఏపీ హక్కు అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయమై ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశం కావాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయం రఘువీరాకు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జాతీయస్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఏపీ కాంగ్రెస్ నేతలు సిద్ధం కావాలని రాహుల్ ఆదేశించారు.

More Telugu News