: బీజేపీ నేతల 'చలో సెక్రటేరియట్' ఉద్రిక్తత... కిషన్ రెడ్డి సహా నేతల అరెస్ట్

మునిసిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ తెలంగాణ శాఖ చేపట్టిన 'చలో సెక్రటేరియట్' ఉద్రిక్తంగా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ల నేతృత్వంలో పార్టీ నేతలు, మునిసిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో సచివాలయ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More Telugu News