: ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చకండి: పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని, బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ లా ఏ రాష్ట్రాన్నీ ఏకపక్షంగా విభజించలేదని అన్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా, ప్రజల్లో ఉన్న సందేహాలు తీర్చకుండా, సరైన వనరులను సమకూర్చకుండా విభజించిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా వర్తింపజేయాలని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా నిరాకరిస్తే పరిస్థితి దిగజారుతుందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News