: ఎవరేం చెప్పారో అనవసరం...నిధులు కావాలి: యనమల

పార్లమెంటులో ఎవరేం చెప్పారో మనకు అనవసరమని, మనకు కావాల్సింది నిధులని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో కేంద్ర మంత్రి కేవలం ప్రొసీజర్ మాత్రమే తెలిపారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీని ఆయన సభకు వివరించారు తప్ప ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వమని అనలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర విభజన వల్ల నష్టం జరిగిందని ఆయన తెలిపారు. నష్టపోయిన రాష్ట్రానికి నిధులు కావాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు, స్టేటస్ విషయంలో రాజీలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి నిధులు, స్టేటస్ గురించి కేంద్రాన్ని అడుగుతామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అందరితో మాట్లాడుతారని ఆయన చెప్పారు.

More Telugu News