: పాకిస్థాన్ సిరీస్ నెగ్గింది... టీమిండియా పడిపోయింది!

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ ఐదోస్థానానికి పడిపోయింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ను పాకిస్థాన్ కైవసం చేసుకోవడం భారత్ ర్యాంకు పతనానికి కారణమైంది. 3 టెస్టుల సిరీస్ ను 2-1తో నెగ్గిన పాక్ టీమ్ ర్యాంకుల్లో మూడోస్థానానికి ఎగబాకింది. దాంతో, నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ జట్టు నాలుగో ర్యాంకు దక్కించుకుంది. భారత్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే ఉన్నాయి.

More Telugu News