: లలిత్ మోదీ సమన్లను ఈడీకి తిప్పి పంపిన న్యాయవాది

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమన్లను ఆయన న్యాయవాది మొహమూద్ ఎం అబ్దికి ఈడీ పంపించింది. అయితే, వాటిని ఆయన స్వీకరించకుండా ఈడీకి తిప్పి పంపారు. ఆ సమన్లు తీసుకునేందుకు తాను అధికారిక వ్యక్తిని కాదని ఆయన ఈడీకి స్పష్టం చేశారు. యూకేలో ఉన్న లలిత్ మోదీ అడ్రస్ ఈడీకి తెలుసని, చట్టప్రకారం సమన్లు ఆయనకే పంపాలని మొహమూద్ స్పష్టం చేశారు.

More Telugu News