: పవన్ వ్యాఖ్యలపై ఈ సాయంత్రం 5.00కు ఎంపీ కేశినేని నాని కౌంటర్!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలపై ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ కౌంటర్ ఇవ్వనున్నారు. ఇందుకోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో వివాదాలు రేపిన ఓటుకు నోటు కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ అంశాలపై నిన్న(సోమవారం) పవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన పవన్, ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడకుండా ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేగాక సీమాంధ్ర ఎంపీలకు రోషం లేదా? అని కూడా ప్రశ్నించారు. ఇందుకు స్పందనగానే నాని మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా నానిపై కూడా పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News