: కర్నూలులో శిల్పా గెలుపు... రెండు ఎమ్మెల్సీలూ టీడీపీ ఖాతాలోకే!

ఏపీలో ఉత్కంఠభరితంగా సాగిన ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ విజయఢంకా మోగించింది. కర్నూలు జిల్లా స్థానానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో టీడీపీ, వైసీపీ నేతలు విజయం తమదంటే, కాదు గెలుపు తమదేనని ప్రకటించుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ముగిసిన కౌంటింగ్ లో శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప ప్రత్యర్థి వెంకటేశ్వరరెడ్డి(వైసీపీ)పై 146 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక అంతకుముందే వెలువడిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఫలితంలో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (టీడీపీ) విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన రెండు చోట్లా అధికార టీడీపీనే విజయం వరించింది. దీంతో స్థానిక కోటా కింద భర్తీ అయిన ఎమ్మెల్సీ స్థానాలన్నీ టీడీపీ ఖాతాలోనే పడ్డట్టైంది.

More Telugu News