: జయలలితను ముఖ్యమంత్రిగా ఆమోదిస్తా...ఆమె అహంకారాన్ని మాత్రం అంగీకరించను: ఖుష్బూ

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ తెలిపారు. తిరువనంతపురంలో ఆమె మాట్లాడుతూ, సాటి మహిళగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను ఆమోదిస్తానని అన్నారు. అదే సమయంలో జయలలిత అహంకారాన్ని అంగీకరించలేనని ఆమె చెప్పారు. తాను వ్యక్తిగత, వృత్తిపరమైన కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నానని తెలిపారు. పిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దవాళ్లవుతున్నారని, వారిని చూసుకోవడం బాటు, పార్టీని పటిష్ఠపరిచే కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నానని ఖుష్బూ స్పష్టం చేశారు. ఇక మోదీ పాలనలో పేదలు, రైతుల జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయని అన్నారు. మోదీ విధానాల కారణంగా, పేదలు నిరుపేదలుగా, ధనికులు మరింత శ్రీమంతులుగా మారుతున్నారని ఆమె విమర్శించారు.

More Telugu News