: మంచోళ్లన్నారు...పక్కన పడేశారు!: టీడీపీలో మరో నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నారు. పార్టీలో కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు ఇవ్వడం లేదనే ఆందోళనతో నిరసన గళమెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా టీడీపీ మినీ మహానాడు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే, విజయనగరం జిల్లా టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సీఎం చంద్రబాబునాయుడు తమను మంచి వారు అంటూనే పక్కన పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా అని, ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు మాట మార్చారని ఆయన మండిపడ్డారు. ప్రైవేటు కళాశాల ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రజలకు కలిగే లాభం ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎవరు ఏమనుకున్నా తాను చెప్పేది ప్రజల మాట అని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News