: బ్యాంకింగ్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు

దేశీయ బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉద్యోగుల నియామకాలు ఈ ఏడాది 25 శాతం మేరకు పెరగనున్నాయి. 2014తో పోలిస్తే నాలుగోవంతు అధికమందికి ఈ సంవత్సరం ఉద్యోగాలు లభించనున్నాయని, కింది స్థాయి ఉద్యోగుల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల వరకూ నియామకాలు జరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త బ్యాంకులు ప్రారంభం అవుతుండడంతో, ఉద్యోగుల సంఖ్యా పెరగనుందని పీపుల్ స్ట్రాంగ్ వ్యవస్థాపక సీఈఓ పంకజ్ బన్సాల్ వివరించారు. ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్ బీఎఫ్ సీలు, కార్పొరేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల్లో సైతం కొత్త ఉద్యోగాలు వెల్లువలా రానున్నాయని వివరించారు. ఐడీఎఫ్ సీ, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు బ్యాంకులను ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో కొత్త శాఖలు రానుండడం, వీటి కోసం వేలాది సంఖ్యలో నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో బ్యాంకింగ్ రంగం ఉపాధి కల్పన విషయంలో మిగతా రంగాలతో పోల్చిచూస్తే ముందంజలో ఉంది.

More Telugu News