: మంత్రి పోచారం కుమారుడికి గాయాలు

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు గాయపడ్డాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెరికిట్ లో లిఫ్ట్ వైరు తెగిపడి నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో పోచారం కుమారుడు సురేందర్ రెడ్డి ఒకరు కాగా, మిగిలిన ముగ్గురూ అధికారులు కావడం విశేషం. దీంతో వీరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు తరలించారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News