: మరో భూకంపం రానుందా?

నేపాల్ ను భారీ భూకంపం వణికించిన నేపథ్యంలో, రానున్న 48 గంటల్లో మరో భూకంపం వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన దర్భంగా, అరారియా ప్రాంతాల్లో ప్రకంపనలు వస్తాయని భారత మెటలర్జికల్ విభాగం తెలిపింది. భూకంపం సంభవించిన తర్వాత కొంతకాలం పాటు ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలానే రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఆఫ్టర్ షాక్స్ గా భావించే ఈ ప్రకంపనలు ఏమంత తీవ్రతను కలిగి ఉండవని తెలుస్తోంది.

More Telugu News