: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోదీ... ఎంజాయ్ చేశానన్న ప్రధాని

ఇంతవరకు పని చేసిన ప్రధానమంత్రుల కంటే ప్రస్తుత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా భిన్నం. ప్రతి విషయంలోనూ స్వేచ్ఛగా, బహిరంగంగా స్పందిస్తారు. అంతేకాదు ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తారు. తాజాగా ఆయన తన కార్లు, కాన్వాయ్ వదిలిపెట్టి ఢిల్లీ మెట్రో రైలులో ధౌలా కువాన్ నుంచి ద్వారక వరకు ప్రయాణించారు. దానిపై ట్విట్టర్ లో మోదీ స్పందిస్తూ, "మెట్రో రైలులో ప్రయాణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఢిల్లీ మెట్రోకు కృతజ్ఞతలు. శ్రీధరన్ జీకు (మెట్రో రూపకర్త) కూడా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.

More Telugu News