: స్కైపీ నుంచి 'మేడ్ ఫర్ ఇండియా' యాప్

ఇంటర్నెట్ వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ తో వినియోగదారులను ఆకట్టుకున్న స్కైపీ ఇప్పుడు భారత్ వాసుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకువస్తోంది. దేశంలోని లో-స్పీడ్ 2జీ, త్రీజీ మొబైల్ ఫోన్ నెట్ వర్క్ లకు, సాధారణ వేగం కలిగి ఉండే ప్రాసెసర్లకు ఉపయుక్తంగా ఉండేలా ఈ యాప్ ను తీర్చిదిద్దినట్టు స్కైపీ ప్రతినిధి ఫిలిప్ సెల్జాంకో తెలిపారు. స్కైపీ పరిశోధన బృందం ఈ 'మేడ్ ఫర్ ఇండియా' యాప్ ను భారత నెట్ వర్క్ లలో అనేకమార్లు పరీక్షించిందని చెప్పారు.

More Telugu News