: వై-ఫై రేంజిని పది రెట్లు పెంచే కొత్త టెక్నాలజీ

వై-ఫై రేంజిని పెంచేందుకు పరిశోధకులు కొత్త టెక్నాలజీకి రూపకల్పన చేశారు. దీని సాయంతో వై-ఫై పరిధిని పది రెట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఎల్ఈడీ లైట్లు కీలక పాత్ర పోషిస్తాయి. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో వై-ఫై బ్యాండ్ విడ్త్ సమస్యలకు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. వైర్ లెస్ ట్రాన్స్ మిషన్ కోసం ఎల్ఈడీ కాంతి ప్రసారాన్ని వినియోగించుకోవడం ఈ టెక్నాలజీలో ప్రధాన సూత్రం. ఈ టెక్నాలజీలో భాగంగా ఖరీదైన వస్తువులేవీ వినియోగించాల్సిన అవసరం లేకపోవడంతో ఇది చవకగానే లభ్యం కానుంది. అన్ని రకాల వై-ఫై వ్యవస్థలతో ఇది పనిచేస్తుంది. ఓరెగాన్ యూనివర్శిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానానికి 'వైఫో' అని నామకరణం చేశారు.

More Telugu News