: 39 రోజుల్లో 22.5 కోట్ల కి.మీ... అంగారక యాత్ర కోసం కొత్త ఇంజన్ అభివృద్ధి చేస్తున్న నాసా

భవిష్యత్ లో అంగారకుడిపై మానవ నివాసాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న నాసా సాధ్యమైనంత తక్కువ సమయంలో అక్కడికి మానవులను, వస్తువులను తీసుకువెళ్లేలా సరికొత్త ఇంజన్ ను అభివృద్ధి చేస్తోంది. కేవలం 39 రోజుల్లో అంగారకుడిపైకి మనుషులను ఈ ఇంజన్ తో కూడిన అంతరిక్ష నౌకలో పంపాలన్నది నాసా అభిమతం. సెకనుకు 66.8 కి.మీల దూరం పయనించేలా వేరియబుల్ స్పెసిఫిక్ ఇంపల్స్ మేగ్నటో ప్లాస్మా రాకెట్ ఇంజన్ (వాసిమిర్ ఇంజన్) పేరిట దీన్ని తయారు చేస్తున్నారు. ఇందుకోసం టెక్సాస్‌ కు చెందిన ఏడ్ ఆస్ట్రా రాకెట్ సంస్థకు 10మిలియన్ అమెరికన్ డాలర్లను నాసా మంజూరు చేసింది. ఈ రాకెట్ తయారీ పూర్తయితే అంగారక యాత్ర మరింత సులభం కానుంది.

More Telugu News