: గుర్గావ్ అమ్మాయికి 'ఫెమినా మిస్ ఇండియా-2015' కిరీటం

'ఫెమినా మిస్ ఇండియా-2015' కిరీటం గుర్గావ్ కు చెందిన అదితి ఆర్యా సొంతం చేసుకుంది. గతేడాది విజేత కోయల్ రాణా నుంచి ఆ కిరీటం ఆమెకు దక్కింది. తొలి, ద్వితీయ రన్నరప్ లుగా ఆఫ్రీన్ రాచెల్ వజ్, వర్తికా సింగ్ లు నిలిచారు. ముంబయిలోని యశ్ రాజ్ స్టూడియోలో నిర్వహించిన ఈ 52వ అందాల పోటీల్లో దేశ వ్యాప్తంగా 21 మంది సుందరాంగులు పాల్గొన్నారు. వారందరిలో ఐదుగురు ఫైనల్ కు చేరారు. వారిలో ఈ ఏడాది మిస్ ఇండియా విజేతగా అదితి నిలిచింది. గ్రాండ్ గా నిర్వహించిన ఫైనల్ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు కరీనాకపూర్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, షాహిద్ కపూర్ లు నృత్య ప్రదర్శన చేశారు.

More Telugu News