: ముగిసిన సింగపూర్ పితామహుడు 'లీ క్వాన్ యూ' అంత్యక్రియలు

సింగపూర్ వ్యవస్థాపక నాయకుడు, మాజీ ప్రధాని లీ క్వాన్ యూ అంత్యక్రియలు ముగిశాయి. కొన్ని రోజులుగా పార్లమెంటు భవనంలో ప్రజల సందర్శనార్థం ఉంచిన ఆయన భౌతికకాయాన్ని ఈరోజు వెలుపలకు తీసుకొచ్చారు. ఈ సమయంలో క్వాన్ కు తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. 'గుడ్ బై మై డియర్ లీ' అంటూ ఆయనకు వీడ్కోలు పలికారు. తరువాత భారీ భద్రత బలగాలు పరేడ్ నిర్వహించాయి. తుపాకులతో గాల్లోకి పేల్చి లీకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, ఇతర దేశాల ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు.

More Telugu News