: వచ్చేస్తున్నాడు రాహుల్...!: సోనియా

ప్రస్తుతం సెలవులో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త్వరలో తిరిగి వస్తారని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ఆ తరువాత అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తారని అన్నారు. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో, రైలు ప్రమాదంలో చనిపోయిన రైతు అయూబ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ, తన కుటుంబం తరఫున ఇక్కడికి వచ్చానని, అమేథీ, రాయ్‌ బరేలి నియోజకవర్గాలు తాను పనిచేసేవేనని తెలిపారు.

More Telugu News