: లాక్కున్నామంటే ఆధారాలుండాలిగా... పవన్ ఏ సందర్భంలో పోరాటమన్నారో?: చంద్రబాబు విస్మయం

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం రైతుల భూములను లాక్కున్నామంటే ఆధారాలుండాలిగా? పవన్ ఏ సందర్భంలో పోరాటం చేస్తానన్నారో ?’’ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విస్మయం వ్యక్తం చేశారు. నిన్నటి తుళ్లూరు పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. రైతుల మేలు కోసమే భూ సమీకరణ చేపట్టామని చెప్పిన చంద్రబాబు, భూములు లాక్కున్నామని చెబుతున్న వారు ఆధారాలు చూపాలన్నారు. శకలాల నుంచి రాష్ట్రాన్ని నిర్మిస్తుంటే, విమర్శలు చేయడం సబబు కాదని కూడా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News