: తుళ్లూరు కేంద్రంగా కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు

తుళ్లూరు కేంద్రంగా కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లి ఎస్ డీపీవో పరిధిలో 3 పోలీస్ స్టేషన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుని, అమలు చేసింది. తొలగించిన 3 పోలీస్ స్టేషన్లను తుళ్లూరుకు జత చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, పెదకూరపాడులను తుళ్లూరుకు జతపరుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాజధాని పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకున్నట్టైంది.

More Telugu News